తెలుగు సినిమా పాటలకి ఊపిరిపోసిన వారిలో వేటూరి సుందరరామమూర్తి గారి సేవ వర్ణనాతీతం.కథకనుగుణంగా వారు చేసే పద ప్రయోగాలకు గాని సందర్భానుసారంగా సంధించే పదజాలానికి గాని ఎంతటి వారైనా మంత్రముగ్ధులౌతారు.
"భూదారిలో నీలాంబరి..మా సీమకే చీనాంబరి" అని గోదావరిని పడవళ్లు తొక్కించినా, "ఓంకార నాదాను సంధానమౌ గానమే" అని శంకరాభరణం అందించినా అది వేటూరి వారికే దక్కింది.
"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" , "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఈ రెంటి నట్టనడుమ, నీకెందుకింత తపన", "ఎడమచేతన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే..ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో..", "ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళా" అంటూ ఎన్నో భావప్రధాన సాహిత్యాలను అందించిన ఘనత వారిది.స్వచ్ఛమైన తెలుగు పాటలను మనకు అచ్చంగా అందించిన వేటూరి వారిది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం అనడంలో అతిశయోక్తి లేదు!
Friday, September 4, 2009
తెలుగు నాట వేటూరి పాట
Posted by raviteja at 3:46 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment